ఓ యువకుడు సరదాగా చెరువులోకి దిగి.. ఈత కొడుతూ పుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో ఓ జలగ అతని ప్రైవేట్ పార్ట్లోకి దూరింది. ఆ విషయం తెలియక ఆ యువకుడు.. చెరువులో నుంచి బయటకు వచ్చాడు. బాగా అలసటగా ఉండటంతో ఇంటికెళ్లి నిద్ర పోయాడు. అయితే అతని మర్మాంగంలో తీవ్రమైన నొప్పి రావటంతో సరిగా నిద్ర పట్టలేదు. మూత్రం వచ్చినట్లు అనిపిస్తే.. బాత్రూంకు వెళ్లాడు. తన ప్రైవేట్ పార్ట్ ని చూసి షాక్ అయ్యాడు.
అప్పటికే ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ పై వాపు వచ్చింది. ఇక భయంతో ఆ యువకుడు.. హాస్పిటల్ వైపు పరుగులు పెట్టాడు. అక్కడ డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా.. అతని మూత్రాశయంలో జలగ కనిపించింది. మూత్రాశయం నుంచి అంగం ద్వారా జలగను బయటకు తీయడం డాక్టర్లకు కష్టంగా మారింది. మొత్తానికి వైద్యులు అతనికి శస్ర్త చికిత్స చేశారు. బైపోలార్ రెసెక్టోస్కోప్ ను పంపి జలగను చంపేశారు. ఆ తర్వాత జలగను బయటకు తీశారు. అంగం నుంచి మూత్రాశయంలోకి వెళ్లిన జలగ.. సుమారు 500 మిల్లిమీటర్ల రక్తాన్ని తాగినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధిత యువకుడు ఆరోగ్యకరంగా ఉన్నాడు. ఈ ఘటన కాంబోడియాలో చోటు చేసుకుంది.