గుజరాత్ లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజా గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలాకు కరోనా సోకిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయనను హోం ఐసోలేషన్ లో ఉంచారు. ఇటీవల ఆయన ఎన్సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.