పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కాలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టనుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా హైదరాబాద్లో గాంధీభవన్ నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరబాద్ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన నిర్వహించారు.