ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. సోమవారం ఆయన ముంబై వెళ్తూండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పవార్ కాన్వాయ్ లోని ఓ కారు బోల్తా కొట్టింది. అయితే, అప్పటికే శరద్ పవార్ కారు ముందుకు వెళ్లిపోవడంతో ఆయన సేఫ్ అయ్యారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయని పూణే పోలీసులు తెలిపారు. పవార్ కు గతంలో కూడా కారు ప్రమాదం జరిగింది. గత ఏడాది రైతులను పరామర్శించడానికి వెళ్లినపుడు శరద్ పవార్ కారు రోడ్డుప్రమాదానికి గురైంది.