కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే పాలకొలను నారాయణరెడ్డి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డి పల్లె గ్రామం. 1962లో మైదుకూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేసి ఎమ్మెల్యే గెలిచారు. ఆయన మృతిపట్ల వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణారావు సంతాపం తెలిపారు.