suddala nissar die due to corona
కరోనాతో ప్రజాగాయకుడి గొంతు మూగబోయింది. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేత సుద్దాల నిస్సార్ కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈయూ నేతగా, ప్రజానాట్యమండలి కార్యదర్శిగా నిస్సార్ విశేష సేవలందించారన్నారు. గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చేరి.. చికిత్స పొందుతూ మృతి చెందారు. నాయా గద్దర్ గా పేరుపొందిన ఆయన ఆత్మ శాంతించాలని.. పలువురు నేతలు కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.