బీహార్లో శుక్రవారం 352 కరోనా కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన రోగుల సంఖ్య 14 వేల 330 కు పెరిగింది. మరోవైపు, పెరుగుతున్న సంక్రమణ కేసుల కారణంగా, పాట్నాతో సహా 6 జిల్లాల్లో లాక్డౌన్ ను తిరిగి అమలు చేశారు. పాట్నా, పూర్నియాలో జూలై 10 నుండి 16 వరకు, నవాడా ,బక్సార్ లో జూలై 10 నుండి 12 వరకు, భాగల్పూర్ లో జూలై 9 నుండి 16 వరకు , కిషన్గంజ్ లో జూలై 9 నుండి ఆంక్షలు విధించారు. ఈ సమయంలో కేవలం అవసరమైన వస్తువుల దుకాణాలు
మాత్రమే తెరిచి ఉంటాయని పేర్కొంది. పైగా షెడ్యూల్ ప్రకారమే వాటిని తెరవడానికి, మూసివేయడానికి అనుమతి ఇచ్చింది.