అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు తీవ్రవాదుల హతం

Update: 2020-07-11 15:36 GMT

అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు తీవ్రవాదుల హతమయ్యారు. భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు నాగా మిలిటెంట్లు హతమయ్యారు. తిరాప్‌ జిల్లా ఖోన్సా ప్రాంతంలో శనివారం ఉదయం 4.30 గంటలకు ఎన్‌కౌటర్‌ జరిగిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

నాగా వేర్పాటువాద సంస్థ అయిన నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలిమ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌)-ఐఎమ్‌ సభ్యులు జరిపిన కాల్పుల్లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఓ సైనికుడు గాయపడ్డాడని తెలిపారు. ఘటనా స్థలంలో నాలుగు ఏకే 47 తుపాకులు, రెండు చైనీస్‌ ఎంక్యూ, 5 కిలోల పేలుడు పదార్థాలు, ఒక కిలో ఐఈడీ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Similar News