దేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కరోనా విలయతాండవానికి దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,637 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,553కు చేరింది. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 551 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 22,674 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 2,92,258 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 5,34,621 మంది కోలుకున్నారు.