మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ కరోనా మహమ్మారి మహారాష్ట్ర గవర్నర్ నివాసానికి తాకింది. రాజ్ భవన్ లో పని చేసే ఉద్యోగుల్లో 16 మందికి శనివారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
మొత్తం 100 మందికి కొవిడ్ టెస్టులు చేయగా.. అందులో 55 మంది ఫలితాలు వచ్చాయి. వీరిలో 14 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.
కాగా, మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,46,600 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 10,116 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 99,902 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 1,36,985 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.