ఆంధ్రప్రదేశ్లో సోమవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఒడిసా వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక కోస్తా, రాయలసీమలో రుతు పవనాలు మోస్తరుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి.