అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం

Update: 2020-07-13 11:27 GMT

అండమాన్ నికోబార్ దీవుల్లో వరుస భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఈ వరుస భూప్రకంపనలతో అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. తాజాగా సోమవారం తెల్లవారుజామున 2.36 గంటలకు భూకంపం సంభవించింది.

అండమాన్ నికోబార్ దీవుల్లోని డిజ్లీపూర్ కు ఉత్తరాన 153 కిలోమీటర్ల దూరంలో సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు తెలిపారు. జూన్ 28 వ తేదీన డిజ్లీపూర్ కేంద్రంగా భూకంపం సంభవించింది.

Similar News