తెలంగాణ సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగింపు

Update: 2020-07-13 15:55 GMT

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై స్టే పొడిగించింది హైకోర్టు. ఈ నెల 15 వరకూ కూల్చివేత పనులు చేపట్టవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ నిర్ణయాన్ని షీల్డ్ కవర్లో సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాయంత్రంలోగా వివరాలు సమర్పిస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అటు భవనాల కూల్చివేత అనుమతులపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టే ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత పనులు నిలిచిపోయాయి. దీంతో శనివారం సచివాలయ భవన కూల్చివేత ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. సోమవారం వరకు సచివాలయ భవనాల కూల్చివేత చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Similar News