కరోనా చికిత్సకు వాడుతున్న ఫెవిపిరావిర్ ఔషధం ధరను గ్లెన్మార్క్ సంస్థ తెలిపింది. ఒక్కో టాబ్లెట్ ధర రూ. 103 రూపాయలకు ఉండగా.. దీనిలో 27శాతం కోత విధించడంతో రూ. 75కి చేరింది. తక్కువ లేద మధ్య స్థాయిలో కరోనా ఉన్న వారికి ఈ మెడిసిన్ వాడవచ్చని గ్లెన్మార్క్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ యాజమాన్యం మాట్లాడుతూ.. ఈ ఔషధాన్ని భారత్ లోనే తయారు చేస్తున్నామని తెలపింది. ధర తగ్గడంతో వినియోగదారులకు చాలా మేలు జరుగుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.