ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలో వరుసగా భూకంపం సంభవిస్తుంది. గురువారం ఉదయం గుజరాత్, హిమాచల్ప్రదేశ్లో భూ ప్రకంపనలు సంభవించాయి. గుజరాత్ లో ఉదయం 7.40 గంటలకు 4.5 తీవ్రతతో, హిమాచల్ప్రదేశ్లో 4.47కు 2.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఈ సమాచారాన్ని తెలియజేసింది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ జరగలేదని సమాచారం.