స్వామీజీ పురుషోత్తం ప్రియాదాస్జీ మహరాజ్ శివైక్యం చెందారు. 78 ఏళ్ల స్వామి ప్రియాదాస్జీ గురువారం పరమపదించారు. స్వామీజీ పురుషోత్తం ప్రియాదాస్జీ మహరాజ్ శ్రీ స్వామినారాయణ్ గడీ సంస్థాన్ ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకుడు. శ్రీ స్వామినారాయణ్ గడీ సంస్థాన్ గుజరాత్లోని మణినగర్ కేంద్రంగా స్వామి నారాయణ్ బోధనలతో గుర్తింపు పొందింది. స్వామి ప్రియాదాస్జీ మృతిపట్ల ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మహిళా సాధికారత, విద్య గురించే చెబుతుండేవారని తెలిపారు.