తెలంగాణలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కేసుల సంఖ్య వెయ్యి దాటడం కామన్ ఐంపోయింది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా మరో 1,478 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 806ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,496కు చేరింది. అలాగే శుక్రవారం ఏడుగురు మరణించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 403కు చేరింది. మొత్తం కేసులలో 28,705 మంది కోలుకున్నారు. దాంతో 13,389 యాక్టివ్ కేసులున్నాయి, ఇక కొత్తగా నమోదైన కేసులలో హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలో ఇలా ఉన్నాయి. రంగారెడ్డి 91, మేడ్చల్
82, కరీంనగర్ 77,
వరంగల్ అర్బన్ 51, పెద్దపల్లి, నల్గొండలో 35 చొప్పున, కామారెడ్డి 31, సిరిసిల్ల 27, నాగర్కర్నూల్, మెదక్ 23 చొప్పున, సూర్యాపేట్, సంగారెడ్డిలో 20 చొప్పున, మహబూబ్నగర్ 19, ఖమ్మం 18, వికారాబాద్ 17, మంచిర్యాల 15, నారాయణపేట 14, ఆసిఫాబాద్, మహబూబాబా ద్, భువనగిరి, నిజామాబాద్లలో 11 చొప్పున, జనగామ 10, సిద్దిపేటలో 8, జగిత్యాలలో 4, వనపర్తి, భూపాలపల్లి, గద్వాలలో 2 చొప్పున, ములుగు, కొత్తగూడెంలో ఒక్కొక్క కేసు నమోదయింది. శుక్రవారం ఒక్కరోజే 15,124 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.