ఏపీని కాపాడండి.. గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

Update: 2020-07-19 16:06 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమని లేఖలో వివరించారు. ఈ రెండు బిల్లులను శాసనమండలి తిరస్కరించిదని.. ఈ బిల్లులను కౌన్సిల్ సెలక్ట్ కమిటికీ సూచించిందని అన్నారు. రాజధాని తరలింపు వ్యవహారం హైకోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు. ప్రజా ప్రయోజనా దృష్యా సరైన చర్యలు తీసుకోవాలని.. ఏపీని కాపాడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Similar News