దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కూడా కొత్తగా 1,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 45,928కి చేరింది. అందులో 28,664 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 17,264 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,108కి చేరింది.