దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. బిహార్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 431 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 28,564కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 179 మంది మృతిచెందారు.