దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కేవలం వారం రోజుల్లోనే 2.6 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా ప్రతిరోజు 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 50 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 49,310 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12,87,945కు చేరింది. ఇందులో 4,40,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8,17,209 మంది కోలుకున్నారు. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు 30,601 మంది ప్రాణాలు కోల్పోయారు.