ఛత్తీస్గఢ్లో దారుణం చోటుచేసుకుంది. ఊపిరాడక 50 ఆవులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటన బిలాస్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ పంచాయతీ భవన్లోని అత్యంత ఇరుకైన గదిలో 50 ఆవులను ఉంచారు. దీంతో అవి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాయి. గది నుంచి దుర్వాసన వస్తున్నదని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఘటనకు బాధ్యుడైన సర్పంచ్పై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.