ఏపీలో కరోనా కల్లోలం కోనసాగుతోంది. గత 24 గంటల్లో 53,681 శాంపిల్స్ ను
పరీక్షించగా 7,813 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే కొత్తగా 3,208 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక కోవిడ్ వల్ల గుంటూరు లో తొమ్మిది మంది, పశ్చిమ గోదావరి లో ఎనిమిది మంది, తూర్పు గోదావరి లో ఆరుగురు, కృష్ణ లో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు,
చిత్తూర్ లో ఐదుగురు, విజయనగరం లో నలుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, నెల్లూరు లో ఒక్కరు మరియు ప్రకాశం లో ఒక్కరు మరణించారు. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 85,776 పాజిటివ్ కేసు లకు గాను 40,406 మంది డిశ్చార్జ్ కాగా
985 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 44,385 గా ఉంది.