క్వారంటైన్ సెంటర్ లో దుర్వాసన భోజనం

Update: 2020-07-26 15:59 GMT

ఏపీలో కరోనా రోగులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.. క్వారంటైన్ సెంటర్ లో సరైన సౌకర్యాలు లేక రోగులు అల్లాడిపోతున్నారు. నాణ్యమైన ఆహరం దేవుడెరుగు, అసలు మామూలు భోజనం కూడా సకాలంలో అందడం లేదని గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం లోని కోవిడ్ సెంటర్ లో దుర్వాసన వచ్చే భోజనం పెడుతున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ పేషంట్లు కరోనా బారినుంచి త్వరగా కోలుకోవడానికి పౌష్టిక ఆహరంతో కూడిన ఆహరం తీసుకోవడం చాలా అవసరం.

కానీ తాడేపల్లిగూడెం కోవిడ్ సెంటర్లో పరిస్థితి వేరుగా ఉంది. పాడైపోయిన భోజనం పెడుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేషంట్లకు ఇచ్చే భోజనం నుంచి దుర్వాసన రావడంతో డస్ట్ బిన్ లో పడేసి తమ బాధను వ్యక్తం చేశారు. తాము వచ్చిన నాటినుంచి అరకొర బోజనమే పెడుతున్నారని వాపోతున్నారు. ఈరోజు పెట్టిన ఆహారంలో భరించలేని దుర్వాసన రావడంతో భోజనం పడేశామని రోగులు ఆవేదన చెందుతున్నారు.

Similar News