ఏపీలో కొత్తగా 7,627 మందికి కరోనా

Update: 2020-07-26 20:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 47,645

శాంపిల్స్ ని పరీక్షించగా 7,627 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

అలాగే కొత్తగా 3,041 మంది కోవిద్‌ నుండి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల తూర్పు గోదావరి లో తొమ్మిది మంది, విశాఖపట్నం లో ఎనిమిది మంది, కర్నూల్‌ లో ఆరుగురు, కృష్ణ లో ఐదుగురు, నెల్లూరు లో ఐదుగురు, శ్రీకాకుళం లో ఐదుగురు, పశ్చిమ గోదావరి లో ఐదుగురు,

చిత్తూర్‌ లో నలుగురు, విజయనగరం లో ముగ్గురు, అనంతపూర్‌ లో ఇద్దరు, కడప లో ఇద్దరు, గుంటూరు లో ఒక్కరు మరియు ప్రకాశం లో ఒక్కరు మరణించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 93,403 పాజిటివ్ కేసు లకు గాను 43,447 మంది డిశ్చార్జ్ కాగా.. 1041 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 48,915 గా ఉంది.

Similar News