ఏపీలో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. ఒక్కరోజే ఏకంగా 10 వేల పైచిలుకు కేసులు వచ్చాయి.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 70,984 శాంపిల్స్ ను పరీక్షించగా 10,093 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కొత్తగా 2,784 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పు గోదావరి లో పద్నాలుగు మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, విజయనగరం లో ఏడుగురు, చిత్తూర్ లో ఆరుగురు, కర్నూల్ లో ఐదుగురు,
నెల్లూరు లో ఐదుగురు, కృష్ణ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, గుంటూరు లో ముగ్గురు, కడప లో ముగ్గురు, శ్రీకాకుళం లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, పశ్చిమ గోదావరి ఇద్దరు మరణించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,17,495 పాజిటివ్ కేసు లకు గాను.. ఇప్పటివరకూ 52,529 మంది డిశ్చార్జ్ కాగా.. 1,213 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 63,753 గా ఉంది.