టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కరోనా భారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ సోకిన విషయాన్నీ ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని.. తనతో పాటు కుటుంబ సబ్యులకు కూడా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇటీవల తనకు జ్వరం వచ్చి తగ్గిపోయిందని, అయితే ఈ రోజు వచ్చిన టెస్టు ఫలితాల్లో మైల్డ్ కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్దారణ అయిందని వెల్లడించారు. అందువల్ల వైద్యుల సలహాలు తీసుకుంటూ హోం క్వారంటైన్ లో ఉంటున్నట్టు రాజమౌళి తెలిపారు.