ఢిల్లీలో కొత్తగా 1,195 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-07-31 19:39 GMT

ఢిల్లీలో కరోనా ఉద్ధృతి తగ్గింది. గతంలో రోజుకు 4వేలకు పైగా కేసుల నమోదు కాగా, ప్రస్తుతం 2 వేల కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,195 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా బారిన పడి ఒక్కరోజే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 1,35,598కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,705 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా బారి నుంచి ఇప్పటి వరకు 1,20,930 మంది కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారినపడి 3,963 మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News