రూ.35కే కరోనా మందు

Update: 2020-08-05 14:32 GMT

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. పలు దేశంలో ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా నిత్యం కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు కొన్ని యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటే 'ఫావిపిరవిర్‌'. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగుల కోసం 'ఫావిపిరవిర్‌-200 ఎంజీ' ఔషధాన్ని సన్‌ ఫార్మాసూటికల్‌ అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో టాబ్లెట్‌ ధర రూ.35గా నిర్ణయించినట్లు సన్‌ ఫార్మాసూటికల్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది.

Similar News