మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ పాటిల్ నీలంగేకర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. జూలై 16న కరోనాతో శివాజీరావ్ పుణెలోని ఓ హాస్పిటల్లో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శివాజీరావ్ బుధవారం ఉదయం మృతి చెందారు. 1985 జూన్ నుంచి 1986 మార్చి వరకు శివాజీరావ్ పాటిల్ మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు.