ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 60,576 శాంపిల్స్ ని పరీక్షించగా 10,128 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల గుంటూరు లో పదహారు మంది, విశాఖపట్నం లో పన్నెండు మంది, శ్రీకాకుళం లో పది మంది, చితూర్ లో ఎనిమిది మంది, తూర్పు గోదావరి లో ఏడుగురు, కృష్ణ లో ఐదుగురు, నెల్లూరు లో నలుగురు, కర్నూల్ లో ముగ్గురు, విజయనగరం లో
ముగ్గురు,
పశ్చిమ గోదావరి లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, కడప లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 8,729 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,83,566 పాజిటివ్ కేసులకు గాను 1,01,459 మంది డిశ్చార్జ్ కాగా..1,681 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 80,426 గా ఉంది.