తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 1,982 కేసులు

Update: 2020-08-09 12:03 GMT

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంలేదు. ప్రతీ రోజు కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. 12మంది కరోనాతో మృతి చెందారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,495కు చేరింది. అటు, కరోనా మరణాల 627కు చేరాయి. ఇప్పటి వరకు 55,999 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా, 22,869 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Similar News