మా భాషను ఎనిమిదో షెడ్యూల్‌లో పెట్టండి: ఛత్తీస్‌గఢ్ సీఎం

Update: 2020-08-16 09:07 GMT

ఛత్తీస్‌గఢీ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌‌లో చేర్చాలని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ కోరారు. ఆయన ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ భాష ప్రాముఖ్యతను ప్రధాని మోదీకి రాసిన లేఖలో వివరించారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రం ఏర్పడి 20 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ.. దానికి ప్రత్యేక సంస్కృతి , చారిత్రక గుర్తింపు ఉన్నాయని లేఖలో వివరించారు. ప్రభుత్వంతో గుర్తింపు పొంది ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్‌లో 22 భాషలు ఉన్నాయి.

Similar News