వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని నారా లోకేష్ అన్నారు. పాదయాత్రలో ఉన్న లోకేష్ను నూతిరెడ్డిపల్లి వాసులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గ్రామంలో కనీస సౌకర్యాలు లేవని.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు చెప్పిన సమస్యలను ఓపికగా విన్న లోకేష్... టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. టీడీపీ హయాంలో గ్రామాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించామన్నారు. అదే విధంగా 30లక్షల వీధి దీపాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ ఫౌడర్ వేసే పరిస్థితి తేదన్నారు.