ఏపీ ప్రజలకు గులాబీ జెండానే అండ అన్నారు తెలంగాణ మంత్రి హరీష్రావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ పోరాటంతో కేంద్రం తోకముడిచిందని తెలిపారు. స్టీల్ప్లాంట్పై ఇది బీఆర్ఎస్ విజయమని పేర్కొన్నారు. ఏపీలో రెండు పార్టీలు నోరు మూసుకున్నాయన్న ఆయన.. తాము మాత్రం స్టీల్ప్లాంట్పై కొట్లాడామని తెలిపారు. తమ పోరాటంతోనే కేంద్రం దిగివచ్చిందని.. దేశం మొత్తం గులాబీ జెండా, కేసీఆర్ వైపే చూస్తోందన్నారు.