AP Corona Cases: కొత్తగా 1,515 కరోనా కేసులు.. 10 మంది మృతి

AP Corona Cases: గడిచిన 24 గంటల్లో 1,515 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Update: 2021-08-27 12:23 GMT

ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,515 కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో కరోనా బారిన పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 68,865 పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,09,245 మంది కొవిడ్ బారిన పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,64,06,811 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,788కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 903 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,050 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,80,407కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.


Tags:    

Similar News