Ap corona : ఏపీలో కొత్తగా 2,068 కేసులు.. 22 మరణాలు..!
ఏపీలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,641 పరీక్షలు నిర్వహించగా.. 2,068 కేసులు బయటపడ్డాయి.
ఏపీలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,641 పరీక్షలు నిర్వహించగా.. 2,068 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19,64,117కి చేరింది. ఇక కరోనాతో మరో 22 మంది ప్రాణాలను కోల్పోయారు. దీనితో మృతుల సంఖ్య 13,354కి చేరింది. అటు కొత్తగా మరో 2,127 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 49,683 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.