Ap Corona cases : ఏపీలో కొత్తగా 4,169 కరోనా కేసులు..!

Ap Corona cases : ఏపీలో కొత్తగా 4వేల 169 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 53 మరణాలు సంభవించాయి. మొత్తం మరణాల సంఖ్య 12వేల 416కు చేరింది.

Update: 2021-06-22 11:58 GMT

Ap Corona cases : ఏపీలో కొత్తగా 4వేల 169 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 53 మరణాలు సంభవించాయి. మొత్తం మరణాల సంఖ్య 12వేల 416కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53వేల 880 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఏడుగురు మరణించారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, కడప, నెల్లూరులో నలుగురు చొప్పున మరణించారు. విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. గుంటూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృత్యువాత పడ్డారు. ఏపీలో మొత్తం 18లక్షల 57వేల 352 మంది కరోనా బారిన పడ్డారు.

Tags:    

Similar News