Nandyal: నంద్యాల జిల్లాలో ప్రమాదం.. జలాశయంలో కొట్టుకుపోయిన 500 ఆవులు..

Nandyal: నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయంలో.. ప్రమాదవశాత్తు దాదాపు 500 ఆవులు కొట్టుకుపోయాయి.

Update: 2022-07-22 09:13 GMT

Nandyal: నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయంలో.. ప్రమాదవశాత్తు దాదాపు 500 ఆవులు కొట్టుకుపోయాయి. సమీపంలో అడవిలోకి ఈ ఉదయం మేత కోసం వెళ్లాయి ఆవులు. అయితే.. ఒక్కసారిగా అడవి పందులు గుంపులుగా రావడంతో భయపడిన ఆవులు.. జలాశయంలోకి దిగాయి. నీళ్లలో కొట్టుకుపోతున్న ఆవుల్ని.. మత్స్యకారుల సహకారంతో రక్షించారు. దాదాపు 350 ఆవుల్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు రైతులు.మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News