ఏపీలో కొత్తగా 947 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42 వేల 696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 947 కేసులు నమోదయ్యాయి.

Update: 2021-03-27 12:45 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42 వేల 696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 947 కేసులు నమోదయ్యాయి. అయితే గడిచిన 24 గంటల్లో కోవిడ్ బారిన పడి ఎవరూ మరణించలేదు. దీంతో మృతుల సంఖ్య 7 వేల 203 కి చేరింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 8,97,810 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,715 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

Tags:    

Similar News