Raghu Rama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణ రాజుపై మరో కేసు

Raghu Rama Krishna Raju : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుపై మరో కేసు నమోదైంది.

Update: 2022-01-14 13:30 GMT

Raghu Rama Krishna Raju : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుపై మరో కేసు నమోదైంది. ఇటీవల ఓ కేసు విషయంలో నోటీసులు అందించేందుకు వచ్చిన ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌ కుమార్‌ను ఎంపీ అసభ్య పదజాలంతో దూషించారంటూ... చింతలపూడికి చెందిన ఎయిమ్‌ సంస్థ సభ్యుడు గొందిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతలపూడి ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ సొంతగ్రామం. గొంది రాజు ఫిర్యాదు మేరకు ఎంపీ రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు చింతలపూడి సీఐ మల్లేశ్వర రావు తెలిపారు.

Tags:    

Similar News