ACCIDENTS: తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న ప్రమాదాలు

వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. ఒకదాని నుంచి తేరుకోకముందే మరో విషాదం.. బయటికెళ్తే క్షేమంగా వస్తారా అన్న ఆందోళన

Update: 2025-11-04 02:30 GMT

వరుస రో­డ్డు ప్ర­మా­దా­లు తె­లు­గు రా­ష్ట్రా­ల­ను భయ­పె­డు­తు­న్నా­యి. ఒక వి­షా­దం నుం­చి తే­రు­కోక ముం­దే మరో ఘోరం వెం­టా­డు­తోం­ది. దీం­తో ఇంటి నుం­చి బయ­ట­కు వె­ళ్లిన వారు క్షే­మం­గా ఇం­టి­కి వస్తా­రా అనే నమ్మ­కం లేని పరి­స్థి­తు­లు కని­పి­స్తు­న్నా­యి. కర్నూ­లు జరి­గిన ఘోర వి­షాద ఘటన మర్చి­పో­క­ముం­దే మరో ఘోర ఘటన తె­లు­గు ప్ర­జ­ల­ను తీ­వ్ర శో­కం­లో ముం­చే­సిం­ది. రం­గా­రె­డ్డి జి­ల్లా చే­వె­ళ్ల మం­డ­లం మీ­ర్జా­గూడ వద్ద జరి­గిన రో­డ్డు ప్ర­మా­దం­లో 21 మంది చని­పో­యా­రు. నె­త్తు­టి రహ­దా­రి అనే ము­ద్ర పడిన హై­ద­రా­బా­ద్-బీ­జా­పూ­ర్ జా­తీయ రహ­దా­రి నం­బ­ర్ 163 పైనే ఈ ఘోర వి­షా­దం చోటు చే­సు­కో­వ­డం స్థా­నిక ప్ర­జ­ల­ను ఆం­దో­ళన కలి­గి­స్తోం­ది. హై­ద­రా­బా­ద్ నుం­చి కర్నా­ట­క­లో­ని బీ­జా­పూ­ర్ వరకు 365 కి.మీ ఉండే ఈ ఎన్‍హె­చ్ 163 అం­టే­నే రక్తం మరి­గిన రహ­దా­రి అనే పేరు పడి­పో­యిం­ది. ఎక్కడ చూ­సి­నా గుం­త­లు, ఇరు­కు రో­డ్లు, మూల మలు­పు­ల­తో ఆ రో­డ్డు­పై ప్ర­మా­దా­ల­తో ఈ రహ­దా­రి మృ­త్యు­వు­కు కే­రా­ఫ్ అడ్ర­స్ గా మా­రిం­ది.

అతి వేగంతో రోజుకు 15 మంది...

ఇటీ­వల కర్నూ­లు బస్సు ప్ర­మా­దం మర­వ­క­ముం­దే తా­జా­గా తె­లం­గాణ రం­గా­రె­డ్డి జి­ల్లా­లో­ని చే­వె­ళ్ల­లో బస్సు ప్ర­మా­దం జరి­గిం­ది. ఈ ఘట­న­లో 20 మం­ది­కి­పై మర­ణిం­చా­రు. రెం­డు ఘట­న­ల్లో­నూ ఓవర్ స్పీ­డ్ ప్ర­ధాన కా­ర­ణం­గా ఉంది. డ్రై­వ­ర్ల అతి­వే­గం­తో ప్రా­ణా­లు గా­ల్లో కలి­సి­పో­తు­న్నా­యి. తె­లు­గు రా­ష్ట్రా­ల్లో అతి­వే­గం­తో జరి­గే మర­ణా­లు ఎక్కు­వ­గా ఉన్నా­యి. కేం­ద్ర ప్ర­భు­త్వ ని­వే­దిక ప్ర­కా­రం, ఆం­ధ్ర­ప్ర­దే­శ్, తె­లం­గాణ అం­త­టా హై­వే­ల­లో ప్ర­తి­రో­జూ సగ­టున 15 మంది అతి­వే­గం కా­ర­ణం­గా మర­ణి­స్తు­న్నా­రు. 2023లో మా­త్ర­మే, రెం­డు రా­ష్ట్రా­ల­లో­ని జా­తీయ, రా­ష్ట్ర రహ­దా­రు­ల­పై 5,500 మంది అతి­వే­గం సం­బం­ధిత ప్ర­మా­దా­ల­లో ప్రా­ణా­లు కో­ల్పో­యా­రు. ఆం­దో­ళ­న­క­ర­మైన వి­ష­యం ఏం­టం­టే.. తె­లు­గు రా­ష్ట్రా­ల్లో జరి­గే అన్ని రో­డ్డు ప్ర­మాద మర­ణా­ల­లో 30 శాతం కంటే ఎక్కువ అతి­వే­గం కా­ర­ణం­గా­నే సం­భ­విం­చా­యి. ని­ర్ల­క్ష్యం­గా డ్రై­విం­గ్ చే­య­డం వల్ల జరు­గు­తు­న్న ప్రా­ణా నష్టా­ని­కి ఇది ఉదా­హ­రణ. తె­లం­గా­ణ­లో 2020 నుం­చి 2023 మధ్య అతి­వే­గం వల్ల జరి­గిన రో­డ్డు ప్ర­మా­దా­ల్లో 25,000 మం­ది­కి పైగా మర­ణిం­చా­రు. అతి­వే­గం వల్ల సం­భ­విం­చే మర­ణా­ల­లో రా­ష్ట్రం దే­శం­లో ఏడో స్థా­నం­లో ఉంది. గు­జ­రా­త్, ఉత్త­ర­ప్ర­దే­శ్, బీ­హా­ర్, ఒడి­శా వంటి పె­ద్ద రా­ష్ట్రాల కంటే ఇది ఎక్కువ. ఇటీ­వ­లి కా­లం­లో భా­ర­త­దే­శం­లో రో­డ్డు ప్ర­మా­దా­లు పె­రు­గు­తూ­నే ఉన్నా­యి. వీ­టి­లో ప్ర­ధా­న­మై­న­వి అతి వేగం, మద్యం తాగి వా­హ­నా­లు నడ­ప­డం, రాం­గ్ రూట్ డ్రై­విం­గ్ చే­య­డం రో­డ్డు ప్ర­మా­దా­ల­కు ప్ర­ధాన కా­ర­ణం­గా మా­రు­తోం­ది.

కేంద్ర గణాంకాల ప్రకారం...

రోడ్డు రవా­ణా, రహ­దా­రుల మం­త్రి­త్వ శాఖ గణాం­కాల ప్ర­కా­రం దే­శం­లో మర­ణా­లు 1.48 లక్షల (2017) నుం­డి 1.68 లక్షల (2023)కు పె­రి­గా­యి. ఇం­దు­లో దా­దా­పు 70 శాతం మర­ణా­లు అతి వేగం వల్లే జరు­గు­తు­న్నా­యి. ఉత్త­ర­ప్ర­దే­శ్, మధ్య­ప్ర­దే­శ్ వంటి రా­ష్ట్రా­ల్లో ఇటు­వం­టి ఉల్లం­ఘ­నల కా­ర­ణం­గా ప్ర­మా­దా­లు పె­రి­గా­యి.

అది మృత్యు రహదారి

ఎన్ హెచ్163 పై జరు­గు­తు­న్న వరుస ప్ర­మా­దా­లు తీ­వ్ర కల­వ­ర­పా­టు­కు గురి చే­స్తు­న్నా­యి. ఈ రహ­దా­రి­పై జరి­గిన ప్ర­మా­దా­ల్లో వం­ద­లా­ది మంది ప్రా­ణా­లు కో­ల్పో­యా­రు. గతే­డా­ది డి­సెం­బ­ర్‍లో చే­వె­ళ్ల మం­డ­లం ఆలూ­రు స్టే­జి­వ­ద్ద కూ­ర­గా­య­లు అమ్ము­కు­నే­వా­రి­పై ఓ లారీ దూ­సు­కె­ళ్లిన ఘట­న­లో ఆరు­గు­రు ప్రా­ణా­లు కో­ల్పో­యా­రు. అం­త­కు ముం­దు సె­ప్టెం­బ­ర్ లో జరి­గిన వే­ర్వే­రు ప్ర­మా­దా­ల్లో ఆరు­గు­రు ప్రా­ణా­లు వి­డి­చా­రు. ఈ ఏడా­ది జూన్ లో కే­జీ­ఆ­ర్ గా­ర్డె­న్ సమీ­పం­లో ఓ భారీ గుం­త­లో వా­హ­నం బో­ల్తా పడి ఇద్ద­రు దు­ర్మ­ర­ణం చెం­దా­రు. ఇలా ని­త్యం ప్రా­ణా­ల­ను బలి తీ­సు­కుం­టు­న్న ఈ 163 జా­తీయ రహ­దా­రి తె­లు­గు ప్ర­జల వె­న్ను­లో వణు­కు­పు­ట్టి­స్తోం­ది. చే­వె­ళ్ల మం­డ­లం మీ­ర్జా­గూడ బస్సు ప్ర­మా­దా­ని­కి ఎన్ హెచ్ 163 రహ­దా­రి దు­స్థి­తే కా­ర­ణం అని స్థా­ని­కు­లు ఆరో­పి­స్తు­న్నా­రు. ఇలాం­టి రో­డ్డు వి­ష­యం­లో అడు­గ­డు­గు­నా అల­స­త్వం, ని­ర్ల­క్ష్యం ఉం­ద­నే వి­మ­ర్శ­లు వి­ని­పి­స్తోం­ది. ఈ రో­డ్డు­ను వి­స్త­రిం­చేం­దు­కు 2018లో కేం­ద్రం ని­ర్ణ­యిం­చిం­ది. దాం­తో అప్ప­టి వరకు ఆర్‌­అం­డ్‌­బీ అధి­కా­రుల ఆధీ­నం­లో ఉన్న ఈ రో­డ్డు హై­వే­గా ప్ర­క­టిం­చ­డం­తో ఆర్‌­అం­డ్‌­బీ అధి­కా­రు­లు పక్క­కు తప్పు­కు­న్నా­రు. ఆ తర్వాత గత బీ­ఆ­ర్ఎ­స్ ప్ర­భు­త్వ హయాం­లో వి­స్త­రణ కోసం భూ­సే­క­రణ వి­ష­యం­లో పను­లు ఆల­స్యం అయ్యా­యి. ఈ క్ర­మం­లో రో­డ్డు వి­స్త­ర­ణ­లో చె­ట్ల­కు నష్టం కలు­గు­తుం­ద­ని పే­ర్కొం­టూ పర్యా­వ­రణ ప్రే­మి­కు­లు అడ్డు­ప­డ్డా­రు. ఆ తర్వాత ప్ర­జా­ప్ర­తి­ని­ధుల చొ­ర­వ­తో ఈ అం­శం­లో పు­రో­గ­తి చోటు చే­సు­కుం­ది. గత శు­క్ర­వా­ర­మే(అక్టో­బ­ర్‌ 31) మొ­యి­నా­బా­ద్‌-చే­వె­ళ్ల రహ­దా­రి వి­స్త­రణ పను­లు ప్రా­రం­భం అయ్యా­యి. ఇం­త­లో­నే ఈ ఘో­ట­రం సం­భ­విం­చి ఎం­ద­రి కు­టుం­బా­ల్లో­నూ వి­షా­దా­న్ని నిం­పిం­ది.

Tags:    

Similar News