అక్టోబర్ 5నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాం: ఏపీ మంత్రి

అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ పున: ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Update: 2020-09-08 14:20 GMT

అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ పున: ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కేంద్రం నుంచి అన్‌లాక్ 5 మార్గదర్శకాలు విడుదలైన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. విద్యావ్యవస్థలో పలు సంస్కరణలను చేస్తున్నామని అన్నారు. ఇంజనీరింగ్ మోడల్ కరికులంను తీసుకొచ్చామని.. సీఎం ఆలోచన మేరకు స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్‌షిప్‌తో వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. జాతీయ విద్యా పాలసీ రాకముందే సీఎం ఈ విధమైన ఆలోచనలు చేశారని అన్నారు. ఇప్పటికే విద్య కానుక సిద్దం చేశామని మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. డిగ్రీ నుంచి బయటకు రాగానే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యత లభించేలా సంస్కరణలు చేపడుతున్నామన్నారు.

Tags:    

Similar News