జగన్ రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలి : అసదుద్దీన్ ఒవైసీ
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు.;
కర్నూలు పాతబస్తీలో మున్సిపల్ ఎన్నికల సభ నిర్వహించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆయన ఖండించారు. వెంటనే కేంద్రం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. జగన్ రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఆదోనిలో ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు.. ప్రభుత్వం అనుమతివ్వలేదని.. త్వరలో పర్మిషన్ తీసుకొని వస్తానని చెప్పారు.