AMARAVATHI: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు వేదికగా అమరావతి

రాజధానిలో ఏఐ ప్లస్ పేరుతో బిట్స్ పిలానీ క్యాంపస్....రూ.1000 కోట్లు పెట్టుబడి పెడతామన్న బిర్లా... 7000 మంది విద్యార్థులకు చోటు కల్పిస్తామని వెల్లడి;

Update: 2025-07-15 02:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రం దే­శం­లో­నే ప్ర­తి­ష్ఠా­త్మక వి­ద్యా సం­స్థ­ల­కు వే­ది­క­గా మా­రు­తోం­ది. రా­జ­ధా­ని అమ­రా­వ­తి సి­గ­లో మరో వి­ద్యా­కు­సు­మం వి­రి­య­నుం­ది. ప్ర­ఖ్యాత వి­ద్యా­సం­స్థ బి­ర్లా ఇన్‌­స్టి­ట్యూ­ట్‌ ఆఫ్‌ టె­క్నా­ల­జీ అం­డ్‌ సై­న్స్‌ (బి­ట్స్‌) తన క్యాం­ప­స్‌­ను రా­జ­ధా­ని అమ­రా­వ­తి­లో ఏర్పా­టు చే­సేం­దు­కు ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. అమ­రా­వ­తి­లో ఏఐ ప్ల­స్ క్యాం­ప­స్ ఏర్పా­టు చే­య­ను­న్న­ట్లు బి­ర్లా ఇన్స్‌­టి­ట్యూ­ట్‌ ఆఫ్ టె­క్నా­ల­జీ అండ్ సై­న్సె­స్‌-బి­ట్స్‌ వి­శ్వ­వి­ద్యా­లయ కు­ల­ప­తి, పా­రి­శ్రా­మి­క­వే­త్త కు­మా­ర­మం­గ­ళం బి­ర్లా ప్ర­క­టిం­చా­రు. రూ.1,000 కో­ట్ల పె­ట్టు­బ­డి­తో "ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్ ప్ల­స్" పే­రు­తో అమ­రా­వ­తి­లో కొ­త్త క్యాం­ప­స్ ని­ర్మిం­చ­ను­న్న­ట్టు స్ప­ష్టం చే­శా­రు. ఈ క్యాం­ప­స్‌­ను రెం­డు దశ­ల్లో అభి­వృ­ద్ధి చే­స్తూ, మొ­త్తం 7,000 మంది వి­ద్యా­ర్థు­ల­కు చోటు కల్పిం­చ­ను­న్న­ట్లు తె­లి­పా­రు. ఈ ప్రా­జె­క్టు­ను 2027 నా­టి­కి ప్రా­రం­భిం­చా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­మ­ని వి­వ­రిం­చా­రు. అమ­రా­వ­తి క్యాం­ప­స్‌­ను ఆధు­నిక సాం­కే­తిక వి­ద్యా­కేం­ద్రం­గా తీ­ర్చి­ది­ద్దు­తా­మ­ని బి­ర్లా తె­లి­పా­రు. కృ­త్రిమ మేథ, డే­టా­సై­న్స్‌, రో­బో­టి­క్స్‌, కం­ప్యు­టే­ష­న­ల్‌ లిం­గ్వి­స్టి­క్స్‌, సై­బ­ర్ ఫి­జి­క­ల్ సి­స్ట­మ్స్ తది­తర కో­ర్సు­ల­కు ప్రా­ధా­న్య­మి­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. స్మా­ర్ట్‌, సు­స్థిర మౌ­లిక సౌ­క­ర్యా­ల­తో 2 దశ­ల్లో 7000 మంది వి­ద్యా­ర్థు­ల­కు అవ­కా­శం కల్పిం­చే­లా కేం­ద్రా­న్ని రూ­పొం­ది­స్తా­మ­న్నా­రు. 2027 నుం­చి ప్ర­వే­శా­లు ప్రా­రం­భి­స్తా­మ­ని కు­మార మం­గ­ళం బి­ర్లా వె­ల్ల­డిం­చా­రు. అమ­రా­వ­తి­లో వచ్చే 5 ఏళ్ల­లో 1000 కో­ట్ల రూ­పా­యల పె­ట్టు­బ­డి పె­డ­తా­మ­ని ప్ర­క­టిం­చా­రు. అమ­రా­వ­తి­లో బి­ట్స్ క్యాం­ప­స్ ఉం­డా­ల­నే­ది సీఎం చం­ద్ర­బా­బు ఆలో­చన అని బి­ర్లా వె­ల్ల­డిం­చారు.

దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్

ఐవో­టీ, ఏఐ ఆధా­రిత సే­వ­ల­తో డి­జి­ట­ల్ ఫస్ట్ క్యాం­ప­స్ రూ­పు­ది­ద్దు­కుం­టుం­ద­ని దే­శం­లో ఇప్ప­టి­వ­ర­కు ఎక్క­డా ఇలాం­టి క్యాం­ప­స్ లే­ద­ని ఆయన తె­లి­పా­రు. దే­శం­లో ఉన్న­త­వి­ద్య ది­శ­ను మా­ర్చేం­దు­కు తొలి అడు­గు­గా ఈ క్యాం­ప­స్‌­ను తీ­ర్చి­ది­ద్దు­తా­మ­న్నా­రు. అమ­రా­వ­తి­లో రెం­డే­ళ్లు, వి­దే­శీ వి­శ్వ­వి­ద్యా­ల­యా­ల్లో రెం­డే­ళ్లు అభ్య­సిం­చే­లా డి­జై­న్‌ చే­స్తు­న్నా­మ­ని జా­యిం­ట్ పీ­హె­చ్​­డీ­లు చే­యొ­చ్చ­ని బి­ర్లా వి­వ­రిం­చా­రు. అమ­రా­వ­తి క్యాం­ప­స్‌ దే­శం­లో­నే మొ­ద­టి ఏఐ క్యాం­ప­స్ కా­బో­తోం­ద­ని కం­ప్యూ­ట­ర్‌ సై­న్సు­లో­ని అన్ని ము­ఖ్య­మైన ప్రో­గ్రా­మ్స్‌ అక్కడ ఉం­టా­య­ని ఉప­కు­ల­ప­తి రా­మ­గో­పా­ల­రా­వు చె­ప్పా­రు. వి­విధ మై­న­ర్‌ ప్రో­గ్రా­మ్స్‌­ను అం­దు­బా­టు­లో­కి తె­స్తు­న్నా­మ­ని అన్నా­రు. వ్య­వ­సా­యం నుం­చి వా­తా­వ­ర­ణం, ఆరో­గ్య సం­ర­క్షణ వరకు అన్ని రం­గాల కో­ర్సు­ల­కు ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­ది­స్తు­న్న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. బిట్స్ అమరావతి క్యాంపస్ ఏర్పాటుకు సీఐర్​డీఏ 70 ఎకరాలు కేటాయించింది. సీడ్ యాక్సిస్‌ రోడ్డు పక్కన వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాలనూ ఆలయ నమూనాలో నిర్మిస్తామని తెలిపింది. దీంతో వారు కోరిన ప్రాంతంలోనే ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద కూడా దీనిపై చర్చ జరిగింది. బిట్స్ క్యాంపస్ నమూనాలను ఆయన పరిశీలించారు.

Tags:    

Similar News