Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే... రాజ్యసభలో స్పష్టంగా చెప్పిన కేంద్రం
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అంటూ చాలా స్పష్టంగా చెప్పింది కేంద్రం.;
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అంటూ చాలా స్పష్టంగా చెప్పింది కేంద్రం. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ఈ విషయం ప్రకటించారు. ఏపీ రాజధాని గురించి బీజేపీ ఎంపీ జీవీల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి చాలా క్లియర్గా సమాధానం ఇచ్చారు. గతంలో తిరుపతి పర్యటనలోనూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అమరావతికి మద్దతుగా రాష్ట్ర బీజేపీ నేతలతో మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా ఉద్యమించాలని దిశా నిర్దేశం చేశారు.