Amit Shah : నేడు తిరుపతికి అమిత్‌ షా.. మూడు రోజుల పర్యటన నిమిత్తం..!

Amit Shah : కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుపతికి రానున్నారు.

Update: 2021-11-13 04:00 GMT

Amit Shah : కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుపతికి రానున్నారు. సాయంత్రం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ చేరుకొని అక్కడి నుంచి నేరుగా తాజ్‌ హోటల్‌కు వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాప్టర్‌ లో బయల్దేరి నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు. అక్షర విద్యాలయ, స్వర్ణ భారతి ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వర్ణ భారతి ట్రస్టు 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

Tags:    

Similar News