LOKESH: లోకేశ్ను అరెస్ట్ చెయ్యొద్దు: హైకోర్టు
ఏపీ సీఐడీకి స్పష్టం చేసిన హైకోర్టు... లోకేశ్కు స్వల్ప ఊరట;
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేశ్ ను వచ్చే నెల 4 వరకు అరెస్టు చేయొద్దని ఏపీ సీఐడికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానంలో ఇరువైపుల వాదనలు జరిగాయి. లోకేశ్ తరఫున, ఏపీ సీఐడీ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.మరోవైపు ఫైబర్ నెట్ కేసులో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై.. విచారణను కూడా హైకోర్టు వచ్చే నెల 4కు వాయిదా వేసింది.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేష్ దాఖలు చేసిన మరో పిటిషన్పై హైకోర్టులో ఉదయం విచారణ జరిగింది. ఈ కేసులో నారా లోకేష్ కు 41ఏ C.R.P.C. ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని ప్రభుత్వం తరపున వాదించిన ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు . ఈ నేపథ్యంలో ప్రస్తుతం అరెస్ట్ గురించి ఆందోళన లేనందున పిటిషన్ పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు . అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు ఎలైన్మెంట్ వ్యవహారంపై గతేడాది నమోదుచేసిన కేసులో ఏ14గా లోకేష్ పేరును సీఐడీ ఇటీవల చేర్చింది.