ఏలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఉదయం ఆరున్నరకు రాజమండ్రి నుంచి ఎంపీ కాన్వాయ్ బయల్దేరింది. దెందులూరు దగ్గర హైవేపై టూవీలర్ను ఎంపీ కాన్వాయ్ ఢీకొట్టింది. టూవీలర్పై ప్రయాణిస్తున్న వృద్ధుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు. తన కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టి వృద్ధుడు చనిపోయినా.. ఆగకుండా ఎంపీ విజయవాడ వెళ్లిపోయారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని దెందులూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎంపీ బాధ్యతారాహిత్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.