ఏపీలో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అదానీకి.. కడప మిత్రులకు ప్రయోజనం చేకూర్చేందుకే అవసరం లేకున్నా స్మార్ట్ మీటర్లను ప్రజల నెత్తిన రుద్దుతున్నారని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యింది.. పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చడానికా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకోవడానికి ఎకరాల భూమి కావాలి.. పేదలకు మాత్రం సెంటు భూమి మాత్రమే ఇస్తున్నారని అన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఆర్ త్రీ జోన్లో 3 సెంట్ల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.